Mahesh-Rajamouli: `ఆర్ఆర్ఆర్`తో మరో సెన్షేనల్ హిట్ను ఖాతాలో వేసుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది.
రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా.. శ్రీ దుర్గ ఆర్ట్స్ పాతకంపై సీనియర్ నిర్మాత కె ఎల్ నారాయణ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్ బేస్డ్ త్రిడీ యానిమేషన్ , విఎఫ్ ఎక్స్ స్టూడియోస్ ను సంప్రదించాడట జక్కన్న.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు వారితో టైఅప్ అవబోతున్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన జక్కన్న.. వారితో దిగిన ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. అలాగే ఈ సినిమా కోసం దర్శకధీరుడు ఏకంగా మూడేళ్లు తీసుకోబోతున్నారట. అంటే మహేశ్ రాజమౌళితో సినిమా చేయాలంటే.. ఆయనకు మూడేళ్లు అంకితం ఇవ్వాల్సిందే.
మహేశ్ తన కెరీర్ లోనే ఒక సినిమా కోసం అంత సమయాన్ని వినియోగించడం ఇదే తొలిసారి. దీంతో ఈ విషయం కాస్త ఆయన అభిమానులను కలవరపెడుతోంది. ఇకపోతే ఇటీవల `సర్కారు వారి పాట`తో సూపర్ హిట్ అందుకున్న మహేశ్.. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తన నెక్స్ ప్రాజెక్ట్ అయిన `SSMB 28`ను చేయబోతున్నాడు. ఇది పూర్తైన వెంటనే రాజమౌళితో తన 29వ చిత్రాన్ని షురూ చేయనున్నాడు.
Visited @Unit_Image in Paris, with @Shobu_ & Kamal Kannan. Had very interesting discussions with co-founders Maxime Leure & Remi ! Thanks a lot Max for taking timeoff and patiently answering all our questions. Looking forward to working together on some exciting work… pic.twitter.com/tFO93r3YX8
— rajamouli ss (@ssrajamouli) June 28, 2022