Intinti Gruhalakshmi: విక్రమ్ వాళ్ళ అమ్మ చెప్పిన పనిమీద ఊరు బయలుదేరుతాడు. ఇక దివ్య సంగతి చూసుకోమని దేవుడికి అప్పచెబుతాడు. ఇక దేవుడు ఇచ్చిన సలహా మెరుగు దివ్య మొదటిసారి ఫోన్ చేయగానే విక్రమ్ కావాలని లిఫ్ట్ చేయడు. అయ్యో అనవసరంగా లిఫ్ట్ చేయలేదు. దివ్య ఫీలవుతుందేమో అని విక్రమ్ ఒత్తుకుంటూ ఉంటాడు. కానీ లవ్ లో ఇలాంటి ట్రిక్స్ ఉండాలి అని దేవుడు అంటాడు. దివ్య రాగానే నాకు చెప్పు అని హాస్పిటల్ బయట దేవుడిని కాపలాగా ఉండమంటాడు విక్రమ్.
లాస్య మనం చేస్తుంది తప్పు. ఇప్పటికైనా వాసుతో నిజం చెప్పేస్తాను అని నందు అంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందా చేతిలోకి వచ్చిన ప్రాజెక్టుని కాదని అనాలని నీకు ఎలా అనిపిస్తుంది అంటూ.. లాస్య మందు పై నిప్పులు జరుగుతుంది నువ్వు ఏమైనా చెప్పు నాకు మాత్రం అతనిని మోసం చేసి ఈ ప్రాజెక్టు తీసుకున్నామనే గిల్టీ ఫీలింగ్ ఉంది వాసుకి నిజం చేప్పేస్తాను అని నందు అంటాడు.
ఇక వాసు బయలుదేరుతున్నాను తులసి నువ్వు ఇద్దరు సంతోషంగా ఉండండి. ఈ ప్రాజెక్టు నీకు ఇవ్వడానికి అసలు కారణం తులసి మీద ఉన్న నమ్మకంతోనే.. మీరు ఇప్పుడు ఉన్నట్టే ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి. వచ్చే ఏడాది నీ పెళ్లి రోజు నాటికి మళ్ళీ వస్తానని వాసు అంటడు. అప్పుడే నందు తులసి నా భార్య కాదని తులసికి విడాకులు ఇచ్చేసి రెండు సంవత్సరాల క్రితమే లాస్యను పెళ్లి చేసుకున్నానని.. నన్ను క్షమించు ఈ పాపంలో తులసికి ఏమాత్రం వాటా లేదు అని నందు వాసుకి చెబుతాడు.
దివ్య ను ఆశ్రయించిన నర్స్ కి ఎలాగైనా న్యాయం చేయాలని హాస్పిటల్ బయట ధర్నా చేయడానికి సిద్ధమవుతుంది దివ్య. ఇక ఈ విషయాన్ని విక్రమ్ తో చెబితే దివ్యకు విక్రమ్ కి మధ్యన అభ్యంతరాలు, ప్రేమ చెడిపోతుందని దేవుడు చెప్పడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో దివ్య ధర్నా చేస్తుండగా రాజ్యలక్ష్మి తన కొడుకు సంజయ్ తో వస్తుంది. సంజయ్ నర్సిని ప్రెగ్నెంట్ చేశాడని వెంటనే న్యాయం చేయాలని దివ్య కోరుతుంది. ఇక అప్పుడే న్యాయం చేస్తానన్న రాజ్యలక్ష్మి లోపలికి వెళ్లబోతుండగా.. అందరి ముందు తాళి కట్టేయమని సంజయ్ కి చెప్పమని రాజ్యలక్ష్మి నిలదీస్తుంది.