Intinti Gruhalakshmi: సామ్రాట్ కి ఫుల్ గా ఫీవర్ వస్తుంది.. తులసి సామ్రాట్ కోసం కషాయం తీసుకు వస్తుంది.. ప్లీజ్ సామ్రాట్ గారు లేచి ఈ కషాయం తాగమని చెబుతుంది.. స్పూన్ తో కషాయం తాగిస్తుంది.. తులసి గారు తులసి గారు అని సామ్రాట్ నిద్రలో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు.. చెప్పే లోపే నిద్రపోతాడు.. తులసి దగ్గర ఉండి సామ్రాట్ కి సేవలు చేస్తూ ఉంటుంది..
తులసి కోసం నందు అదే నంబర్ కి మళ్ళీ కాల్ చేస్తాడు.. అతను చెప్పిన మాటలు ఏవి వినిపించవు కానీ.. అంకుల్ ఆంటీ ఇద్దరు బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెబుతాడు.. ఆ మాట వినగానే నందు షాక్ అవుతాడు.. సామ్రాట్ అప్పుడే నిద్ర లేగుస్తాడు.. నేను ఏమైనా మిమ్మలని ఏమైనా ఇబ్బంది పెట్టనా అని అంటాడు సామ్రాట్.. మనసులో ఎలాంటి ఉద్దేశం కల్మషం లేని వాళ్ళు అగౌరవంగా ప్రవర్తించరు అని తులసి అంటుంది.. సరే మనం బయలు దేరాదామా అని తులసి అంటుంది.. క్యాబ్ బుక్ చేశాను అని సామ్రాట్ అంటాడు..
అమ్మ ఫోన్ చేసింది.. ఏ నిమిషంలోనైనా రావచ్చు అని ప్రేమ్ అంటాడు.. అంతలో లాస్య ఇంట్లో అందరినీ రెచ్చ గొడుతుంది.. తులసి లోపలికి రావడంతోనే నందు ఎదురుగా సీరియస్ గా కనిపిస్తాడు.. ప్రయాణం ఎలా జరిగింది ఆంటీ అని శృతి అడుగుతుంది.. ప్రయాణం కాదు ప్రేమాయణం ఎలా జరిగింది అని అడుగు అని నందు అంటాడు.. మిస్టర్ నందగోపాల్ అని తులసి పెద్దగా అంటుంది.. అరవకు.. నందు ఏం తప్పు మాట్లాడలేదు .. నీ అవతారమే చెబుతుంది.. నువ్వు ఏదో అవకతవక పని చేసి వచ్చావని అని అనసూయమ్మ అంటుంది.. నానమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని ప్రేమ్, దివ్య అంటాడు..
ముందు నీ ఒంటికి అంటుంచుకని వచ్చిన బురద గురించి మాట్లాడు అని అంటాడు.. నందు నేను 3 గంటలకు కాల్ చేశాను.. ఆ కుర్రాడి మీరు ఇద్దరు ఓకే బెడ్ రూమ్ లో ఉన్నాడని చెప్పాడు.. ఓకే బెడ్ రూమ్ లో పరాయి మగాడి తో ఉన్నావా అని తులసి ని నందు అడుగుతాడు.. అవును ఉన్నాను.. కానీ అతను సేవలు చేయడానికి మాత్రమే ఉన్నాను అని తులసి అంటుంది.. నా ముగ్గురు పిల్లల తల్లి మర్యాద జారి ప్రవర్తిస్తుంది అని నందు అంటాడు..
ఇక రేపటి ఎపిసోడ్ లో అగ్నిపరీక్షకు సిద్ధమవు అని నందు అంటాడు.. అగ్నిపరీక్ష పెట్టాల్సింది రాముడు కానీ నీలాంటి రాక్షసుడు కాదు అని తులసి అంటుండగా.. తులసి అని అనసూయమ్మ పెద్దగా అరుస్తుంది.. చాలు అని చెయ్యి ఎత్తుతుంది.. తులసి ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..