Intinti Gruhalakshmi: అత్తయ్య మీరు ఏం కోల్పోయారో మీకు ఇప్పుడు తెలియదు. కానీ ముందు ముందు మీరు ఎంత నష్టాన్ని అనుభవిస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది అని తులసి అంటుంది. అనసూయమ్మ ఏమి మాట్లాడకుండా తన ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పరంధామయ్య వెక్కివెక్కి ఏడుస్తాడు. మీరేమీ బాధపడకండి మావయ్య. ఇకనుంచి ఈ ఇల్లు మీదే ఈ గదిలో మీరు ఉండొచ్చు ఎలాంటి అభ్యంతరము లేదు. మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను అంటూ తులసి ధైర్యం చెబుతుంది.
అనసూయమ్మ ఇంటికి వెళ్ళినా కానించి కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ అందరూ నన్ను మోసం చేశారు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు ఎవ్వరూ లేరు అంటూ కేకలు పెడుతుంది. ఈ లోకంలో నేను నమ్మిన వాళ్లందరూ నన్ను మోసం చేశారు. నేను ఒక్కదానిని అయిపోయాను. నేను ఒంటరిని అయిపోయాను అంటూ అనసూయమ్మ గగ్గోలు పెడుతుంది. చేసినదంతా చేసేసి ఇప్పుడు ఎవ్వరూ లేరు అని అంటుందే అని మిగతా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అమ్మమ్మ ఇలా చేయడం కరెక్టు కాదు కదా అయినా అలా తాతయ్యను అనకుండా ఉండాల్సింది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు.
మరో పక్క లాస్య ఈ విషయాలు నందుకు తెలిస్తే ఇంకేమైనా ఉందా.. నందు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. నందు వచ్చేసరికల్లా ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలి అని అనుకుంటుంది. ఈవిడ గారు రోజు బానే ఉంటారు కదా. ఈ రోజు ఏమైందని ఎంత ఇరిటేట్ అవుతున్నారు అని అనసూయమ్మను చూస్తూ అనుకుంటూ ఉంటుంది లాస్య. ఎలాగైనా అత్తయ్యను కంట్రోల్ చేయాలి అని లాస్య అనుకుంటుంది .
అంతలో ప్రేమ్ శృతి అందరూ ఒక్కొక్కరిగా ఆమె పక్కనుంచి వెళ్తూ ఉంటారు. అందరినీ అనసూయమ్మ అరుస్తూ ఉంటుంది .ఏరా అభి నువ్వు కూడా నా పార్టీలో నుంచి మారిపోయావా .. అంత దూరంగా ఉంటున్నావ్ ఏంటి అని అనసూయమ్మ అభిని అరుస్తుంది. అలాంటిది ఏమీ లేదు నానమ్మ అని అభి అంటాడు. మీరందరూ మారిపోయారా? నాకు ఎవరూ లేరు నేను ఒంటరినైపోయాను అని అనసూయమ్మ అంటుండగా శృతి వెళ్లి తన పక్కన కూర్చుంటుంది. తాతయ్య గురించి తప్పుగా మాట్లాడారు అమ్మమ్మ అంటూ సమాధానం చెబుతుంది..
పరంధామయ్య నిద్రపోతుండగా అనసూయమ్మ అన్న మాటలు గుర్తొచ్చి లేచి ఉలిక్కి పడతాడు. పక్కనే ఉన్న తులసి ఎవ్వరూ లేరు మావయ్య అంటూ మంచి నీళ్ళు ఇస్తుంది. అలా కన్ను అంతగానే మళ్ళీ పరంధామయ్య నిద్రపోతుండగా నేను ఈ రూమ్ బయటే ఉన్నాను నాతో పాటు మన ఇంటికి రండి అంటున్న అనసూయమ్మ మాటలు గుర్తొచ్చి లేచి ఉలిక్కి పడతాడు.. తులసి కాసిన్ని పాలు తీసుకువచ్చి ఇస్తుంది. మీరు నాతో పాటు రండి అంటున్న మాటలకు పరంధామయ్య బాధపడుతూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ మావయ్య కోసం వెతుకుతూ ఉంటుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!