Samantha: “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా తొలి విజయం అందుకున్న సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ డామ్ సంపాదించింది. దక్షిణాది సినిమా రంగంలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ సమంత. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇంకా చాలామంది హీరోల సరసన నటించింది. నాగచైతన్యతో పెళ్లి జరిగాక ఎక్కువ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ రాణించింది. కాగా గత ఏడాది చైతుతో విడాకులు తీసుకున్నాక కెరియర్ పరంగా మళ్ళీ స్పీడ్ అందుకుంది. ఈసారి ఏకంగా బాలీవుడ్ లో కూడా పాగా వేయడం జరిగింది.
“ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ లో సమంత నటన ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత “పుష్ప” ఐటెం సాంగ్ లో సమంత వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఆమెకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. దీంతో కెరీర్ పరంగా మంచి పిక్స్ లో ఉన్న సమంత హఠాత్తుగా షూటింగులు మొత్తం ఆపేసి అమెరికా వెళ్లడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు.. ప్రచారం జరుగుతోంది.
దీంతో అమెరికాలో స్కిన్ సర్జరీ చేయించుకోవడానికి సమంత రెడీ అయినట్లు.. కొన్నాళ్లపాటు షూటింగ్ లు ఆపేసినట్లు.. ఎలక్ట్రానిక్ ఇంకా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. యశోద, శకుంతలం, విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఖుషి. ఇది కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వెబ్ సిరీస్ లు కూడా సామ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే స్కిన్ సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవటంతో షూటింగులు మొత్తం ఆపేయటం మాత్రమే కాదు.. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండాలని సమంత డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!