పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న `జల్సా`, `తమ్ముడు` చిత్రాలు రి-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా `జల్సా` చిత్రాన్ని అత్యధిక థియేటర్స్లో విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటించారు.
పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 2008 ఏప్రిల్ 2న విడుదలై సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. `ఖుషీ` వంటి బ్లాక్ బస్టర్ తరువాత వరసగా ఐదు ప్లాపులను చవి చూసిన పవన్ మళ్లీ `జల్సా`తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
అయితే అభిమానుల కోరిక మేరకు మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను మేకర్స్ రీరిలజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 702 సెంటర్స్ లో జల్సాను విడుదట చేయగా.. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. దాంతో ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా రూ. 2.80 కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏపీ తెలంగాణలో కలిపి 2.40 కోట్లు, అమెరికాలో 30 లక్షలు, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల్లో కలిపి మరో 10 లక్షల కలెక్షన్స్ ను ఈ మూవీ వసూల్ చేసిందని అంటున్నారు. రీసెంట్గా పోకిరి సినిమా రీ రిలీజ్ లో రూ. 1.5 కోట్ల కలెక్షన్స్ అందుకోగా.. జల్సా అంతకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి ఆ సినిమా నెలకొల్పిన రికార్డును చిత్తు చిత్తు చేసింది. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!