అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ధడక్` మూవీతో బాలీవుడ్ లో సినీ కెరీర్ను ప్రారంభించిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత వరుస సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోతో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం ఈ అందాల భామను సౌత్ లోకి తీసుకువచ్చేందుకు ఇక్కడి దర్శకనిర్మాతల సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్.. పెళ్లి, డేటింగ్ విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `డేటింగ్ ఎప్పుడూ సమస్యగానే ఉండేది. నాకు ఎందుకో తెలియదు కానీ.. డేటింగ్ విషయంలో మామ్, డాడ్ ఎప్పుడూ కాస్త డ్రామాటిక్గానే ఉండేవారు.
ఒకవేళ నీకెవరైనా అబ్బాయి నచ్చితే మా దగ్గరకు రా.. మేము పెళ్లి చేస్తాం అనేవాళ్లు. నచ్చిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించేది. మనం ఎప్పుడూ చిల్ అవుతూ ఉండాలి. లైఫ్ లో లైక్ చిల్ అనే కాన్సెప్ట్ ఉండాలి. చిల్ కాన్సెప్ట్ను మామ్, డాడ్ మాత్రం అర్థం చేసుకునేవారు కాదు` అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని, పైగా ఒంటరిగా ఉండటం వల్ల హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నానని జాన్వీ కపూర్ తెలిపింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, జాన్వీ కపూర్ గతంలో శిఖర్ పహారియాతో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జొహార్ కూడా బయటపెట్టారు. అలాగే తన తొలి సినిమా హీరో అయిన ఇషాన్ ఖట్టర్తోనూ జాన్వీ డేటింగ్ చేసినట్లు టాక్ ఉంది.