దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `దఢక్` అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుండో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోయే `ఎన్టీఆర్ 30`లో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపిక అయిందని.. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను జాన్వీ తండ్రి, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ఇప్పటికే ఖండించారు.
విజయ్ దేరకొండతో డేటింగ్ చేస్తానన్న బాలీవుడ్ స్టార్ కిడ్.. షాక్లో జాన్వీ!
అయినా సరే ఈ వార్తలు ఆగడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. ఈ వార్తలపై స్వయంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు.
ఎందుకంటే, ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా నుంచి నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్ రాలేదు. ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను` అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ జాన్వీకి ఆఫర్ ఇస్తాడో..లేదో..చూడాలి.