దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `దఢక్` అనే హిందీ మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. జాన్వీ కపూర్కు తరచూ నెటిజన్లు నుంచి ట్రోల్లింగ్స్ ఎదురవుతూనే ఉంటాయి. స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందని, తనలో టాలెంట్ లేదని, తల్లి అంత అందంగా కూడా ఉండదంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈ ట్రోల్స్ కు తాజాగా జాన్వీ కపూర్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది.
రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ మాట్లాడుతూ..`నా గురించి చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. ఇండస్ట్రీలో నాకంటూ ఉన్న స్థానాన్ని నేను తేలికగా సంపాదించుకున్నాను అని అందరూ అనుకుంటున్నారు. వారసత్వం ద్వారా వచ్చి స్టార్ట్ హోదాను పొందేందుకు ప్రయత్నిస్తున్నానని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ అది నిజం కాదు.
నాకంటూ సొంతంగా గుర్తింపు పొందాలని నేను అనుకుంటున్నా. నాకేమీ టాలెంట్ లేదు. అందంగా కూడా లేకపోవచ్చు. అయితే సెట్స్ లో వందకు వంద శాతం కష్టపడతాను. దానివల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. కష్టపడేతత్వం నాలో మెండుగా ఉంది. ఇదే విషయాన్ని నేను రక్తంతో రాతపూర్వకంగా కూడా ఇవ్వగలను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో జాన్వీ కపూర్ కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి. కాగా, జాన్వీ వచ్చే నెల `మిలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మతుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.
https://newsorbit.com/entertainment-news/janhvi-kapoor-latest-photos-goes-on-viral.html