టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం `లైగర్`. బ్యాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగస్టు 25న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయితే ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ లక్కీ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అందుకు కారణం లేకపోలేదు.. `లైగర్` సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్నే తీసుకోవాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ భావించాడు. ఈ నేపథ్యంలోనే జాన్వీని సంప్రదించగా.. ఆమె ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా `లైగర్`కు నో చెప్పింది. దాంతో నిర్మాత కరణ్ జోహార్ అనన్య పాండేను ప్రిఫర్ చేయడంతో.. పూరి ఆమెనే ఫైనల్ చేశాడు.
కట్ చేస్తే.. `లైగర్` సినిమా చూసిన వారిలో చాలా మంది అనన్య పాండేని, ఆమె పాత్రని బాగా విమర్శిస్తున్నారు. ఈ సినిమాకున్న మైనస్లలో ఆమెను కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ `లైగర్`ను వదులుకుని మంచి పని చేసిందని, లేదంటే ఇలాంటి ఫ్లాప్ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఘోరంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.