సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతోన్న సమంత.. తాజాగా తాను గత కొంతకాలం నుంచి మైయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న ఫోటోను సైతం సమంత షేర్ చేసింది. మైయోసిటిస్ అనేది ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి.
కండరాల్లో వాపు రావడం, బలహీనంగా మారడం, విపరీతమైన నొప్పి వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. సమంత ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుందని తెలియడంతో అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని సైతం సమంత పరిస్థితిని చూసి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్.. `త్వరగా నువ్వు కోలుకోవాలి.. ధైర్యాన్ని మొత్తం నీకు పంపుతున్నా` అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు నాని.. `నువ్వు ఎప్పటిలాగే బలంగా తిరిగి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవని ఆకాంక్షిస్తున్నాను.. జాగ్రత్త` అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
దీంతో ఎన్టీఆర్, నానీ ట్విట్స్ కాస్త వైరల్ గా మారాయి. కాగా, ఎన్టీఆర్ తో సమంత `జనతా గ్యారేజ్`, `రామయ్య వస్తావయ్య`, `బృందావనం`, `రభస` చిత్రాలు చేసింది. అలాగే నానితో కలిసి `ఈగ, `ఎటో వెళ్లిపోయింది మనసు` చిత్రాల్లో నటించింది.
https://newsorbit.com/cinema/samantha-viral-comments-on-his-death.html