యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా విడుదలై దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు.
ఆయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ పాన్ ఇండియా చిత్రం నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ కూడా బయటకు వచ్చింది. కానీ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు.
ఈ విషయంలో అభిమానులు ఎంతగానో నిరాశ చెందుతున్నారు. అయితే ప్రస్తుతం టోక్యోలో ఉన్న ఎన్టీఆర్.. రిటర్న్ రాగానే ఓ మంచి రోజున కొరటాల సినిమాను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడట. అదే సమయంలో `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నారట.
ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలని ఎన్టీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నాడట. టాలీవుడ్ హీరోల్లో ప్రస్తుతం చిరంజీవి మాత్రమే ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సైతం చిరు బాటలో నడవబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారమే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు.
https://newsorbit.com/news/jr-ntr-to-follow-ram-charans-advice.html
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!