పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే `ఆదిపురుష్`ను కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `సలార్`, `ప్రాజెక్ట్-కె` చిత్రాలపై దృష్టి సారించాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీదే ఉండటంతో.. ప్రభాస్ బిజీ షెడ్యూల్స్తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా అయ్యాక.. `స్పిరిట్` అనే మూవీని ఆయన పట్టాలెక్కించనున్నాడు.
`అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ హై బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో తెరకెక్కబోతున్న 25వ చిత్రమిది. ఇందులో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని ఎప్పటి నుండో గుసగుసలు వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించబోతోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు కరీనా కపూర్. ఇప్పటికే మేకర్స్ కరీనా కపూర్ను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే `స్పిరిట్` మూవీకి కరీనా కపూర్ తీసుకోబోయే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఆమె ఏకంగా రూ. 17 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఓ హీరోకు ఏ మాత్రం తీసిపోని రెమ్యునరేషన్ అది. అయినప్పటికీ కరీనా క్రేజ్ దృష్ట్యా అంత భారీ మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించినట్లు టాక్ నడుస్తోంది.