టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `కార్తికేయ 2`. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తే.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, కేఎస్ శ్రీధర్, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం.. ఆగస్టు 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఫస్ట్ షో నుండే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టి.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్టెట్ను రీచ్ అయింది.
ప్రస్తుతం భారీ లాభాలతో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. నార్త్ లోనూ దుమ్ము దులిపేస్తోంది. ఇకపోతే ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. `కార్తికేయ 2` ఓటీటీ రైట్స్ ను జీ5 వారు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారట.
అయితే థియేటర్స్లో ఈ మూవీ సక్సెస్ఫుల్గా రాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్తికేయ 2 ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. థియేటర్స్లో విడుదలైన ఆరు వారాల తర్వాతే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అంటే సెప్టెంబర్ ఆఖరిలో ఈ మూవీ జీ5 వేదికగా సందడి చేయనుంది.