టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ తాజా చిత్రం `కార్తికేయ 2`. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ `కార్తికేయ`కు సీక్వెల్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో అఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తే.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలను పోషించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. జూలై నెలలో విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
వరుస వాయిదాలు.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే `కార్తికేయ 2` హిట్టే!
ఎట్టకేలకు ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే వాయిదా పడింది ఒక్కరోజే మాత్రమే.
అవును, `కార్తికేయ 2` ఆగస్టు 12న కాకుండా.. ఆగుస్టు 13న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 12న నితిన్ నటించిన `మాచర్ల నియోజకవర్గం` సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండకూదనే ఒక్కరోజు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.