Krithi Shetty: కృతి శెట్టి.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. ఫస్ట్ మూవీతోనే సంచలన విజయాన్ని అందుకుని కావాల్సినంత క్రేజ్ను కూడగట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ.. కెరీర్ పరంగా వేరె లేవల్లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో `ది వారియర్`, సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్తో `మాచర్ల నియోజకవర్గం` సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో సూర్య సరసన బాల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు ఒప్పుకుంది. ఇక తాజాగా ఆ బ్యూటీని మరో ఆఫర్ వరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ యంగ్ బ్యూటీని అక్కినేని నాగచైతన్య మళ్లీ లైన్లో పెట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగచైతన్య ఓ మూవీ చేసేందుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.
చైతూకి ఇది 22వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్సీ22` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ షూరూ కానుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా కృతి శెట్టిని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని నేడు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు. కాగా, ఇప్పటికే చైతు, కృతి శెట్టి జంటగా `బంగార్రాజు` మూవీలో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. చైతు బేబమ్మను వదలకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్లోనూ తీసుకున్నాడు.
Welcome aboard The most happening @IamKrithiShetty
Next Announcement Will Enthrall You Today at 11:08 AM 💥#NC22Begins ❤️🔥#NC22 @chay_akkineni @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/2tp5rZgIm4
— venkat prabhu (@vp_offl) June 23, 2022