`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు 30వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితం కానుంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. `ఆర్ఆర్ఆర్` విడుదలైన వెంటనే ఈ సినిమాని ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇకపోతే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ, చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
ఈ లిస్ట్లో కృతి శెట్టి పేరు కూడా ఉంది. అయితే ఈ విషయంపై కృతి శెట్టి స్వయంగా క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇందులో నితిన్ హీరోగా నటించాడు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 12న గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె బదులిస్తూ.. `ఎన్టీఆర్30కి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది. అయితే టాలీవుడ్ లో బిగ్ స్టార్స్ తో నటించాలనేది తన కోరిక అని.. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్ ఒకరని చెప్పుకొచ్చింది. మరి ఈ బ్యూటీ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందో..లేదో..చూడాలి.