యంగ్ బ్యూటీ కృతి శెట్టి రీసెంట్ గా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 16 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
అసలే `ది వారియర్`, “మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయని నిరాశలో ఉన్న కృతి శెట్టికి.. ఈ చిత్రంతో మరో ఫ్లాప్ పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా టూల్స్ పై కూడా కృతి శెట్టి స్పందించింది. బేసిక్ గా తాను పాజిటివ్ పర్సన్ అని, ఈ విషయంలో అయినా మంచిని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. తొంభై శాతం నెగిటివిటీ, పది శాతం పాజిటివిటీ ఉంటే ఆ పది శాతం తీసుకోవడానికి ట్రై చేస్తానని, ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ ఉంటే వదిలేస్తానని చెప్పుకొచ్చింది.
అలాగే మనల్ని కిందకు లాగడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారని, కానీ, అలాంటి వాళ్లను తాను అస్సలు పట్టించుకోనని కృతి పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, కృతి శెట్టి తెలుగుతో నాగచైతన్యకు జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో సూర్య సరసన `అచలుడు` అనే చిత్రంలో నటిస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!