యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి గత కొద్ది రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.
కానీ అనూహ్యంగా ఈ మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయితే వరుస ఫ్లాపుల్లోనూ తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడుని ఓ బంపర్ ఆఫర్ వారించింది. అది కూడా మలయాళం నుంచి రావడం విశేషం. అవును, కృతి శెట్టి మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.
తోవినో థామస్ హీరోగా జితిన్ లాల్ దర్శకత్వంలో `అజయంతే రాన్ దామ్ మోషనమ్` అనే మూవీ తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో తోవినో థామస్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి ఎంపిక అయింది.
ఈ గుడ్ న్యూస్ను కృతి శెట్టి స్వయంగా వెల్లడించింది. అలాగే చిత్ర టీమ్తో దిగిన పలు ఫోటోలను సైతం ఆమె పంచుకుంది. దీంతో కృతి శెట్టి అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
#ajayanterandammoshanam 🥳
My #malayalam #debut EXTREMELY ELATED and grateful 🤍 need all your blessings 🙏🏼🫶🏼
Can’t wait to work with @ttovino #jithinlal #jomontjohn @UGMMovies pic.twitter.com/zJfx7ZQYgb— KrithiShetty (@IamKrithiShetty) October 11, 2022
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!