యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` మూవీతో గ్రాండ్గా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ బ్యూటీకి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయట.కానీ, కృతి శెట్టి వాటిని చేతులారా వదులుకుంటోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృతి శెట్టి త్వరలోనే `మాచర్ల నియోజకవర్గం` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.
ఇందులో కృతి శెట్టితో పాటు కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని, పొలిటికల్ టచ్ తో పాటు మంచి సాంగ్స్ కామెడీ యాక్షన్ అన్నీ ప్యాకేజీగా ఉంటాయని, ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది.
అలాగే తనలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వచ్చాయని, కానీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన కృతి.. అందుకు కారణాన్ని కూడా వెల్లడించింది. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోందని, ఇక్కడ సినిమాలు చేయడమే తానకు ఆనందాన్ని ఇస్తుందని, అందుకే బాలీవుడ్ వైపు చూడటం లేదంటూ పేర్కొంది.