యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` సినిమాతో బేబమ్మగా ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి యూత్లో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన చిత్రాలన్నీ వరసగా విజయం సాధించడంతో.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్లో కృతి చేరింది.
ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్ నుండి సైతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బేబమ్మ తన అందానికి మెరుగులు పెట్టించుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీకి సిద్ధం అవుతుందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల విడుదలైన `ది వారియర్`లో కృతి లుక్స్పై కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి తన పెదాల పరిమాణాన్ని తగ్గించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే ఓ ఫేమస్ డాక్టర్ను సంప్రదించి సలహా కూడా తీసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా, కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే ఈ అమ్మడు `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను పలకరించబోతోంది.నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కాబోతోంది. అలాగే సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, తమిళంలో సూర్యకు జోడీగా `అచలుడు` చిత్రాల్లో నటిస్తోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!