రీసెంట్ `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాతో వచ్చేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు బాబి తెరకెక్కించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ లో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే మాస్ మహారాజ్ రవితేజ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వక.. ఇటీవల డబ్బింగ్ పనులు సైతం షురూ చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా కథపై కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించనున్నారట. సత్యరాజ్ కు ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య కొడుకు చిరంజీవి, రెండో భార్య కొడుకు రవితేజ మధ్య చిన్నప్పటి నుంచి గొడవలు జరుగుతుంటాయట.
అలాగే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపిస్తారని అంటున్నారు. ప్రకాష్ రాజ్ స్మగ్లర్ పాత్రలో కనిపిస్తాడట. ఇక ఈ ముగ్గురి పాత్రల చుట్టూనే కథ ఎక్కువగా నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. విడుదల తర్వాత టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా సంక్రాంతి పోటీలో నలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
https://newsorbit.com/entertainment-news/chiranjeevi-mega-154-movie-digital-rights-sold.html