టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `లైగర్`. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాబోతోంది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణ, రియల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే, రోనీత్ రాయ్, విషు రెడ్డి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. నేడు అట్టహాసంగా ఈ మూవీ ప్రేక్షకులను ముందుకు వచ్చి.. మిశ్రమ స్పందనను దక్కించుకుంది.
భారీ అంచనాల విడుదలైన ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. రొటీన్ కథ కావడం, పూరి మార్క్ కనిపించకపోవడం సినిమాకు మైనస్లుగా మారాయి. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో అదరగొట్టేశాడు. ఇదిలా ఉంటే.. `లైగర్` ఓటీటీ పార్ట్నర్ ఎవరో బయటకు వచ్చింది.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ `లైగర్` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని భారతీయ భాషల హక్కులు హాట్స్టార్ వారే భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్ట్రీమింగ్ మాత్రం థియేటర్స్లో విడుదలైన యాబై రోజుల తర్వాతే అని టాక్ నడుస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!