టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన చిత్రం `లైగర్`. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.
రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనిత్ రాయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కనీసం సగం వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ `లైగర్` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు దక్కించుకుంది. అయితే థియేటర్స్లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపక పోవడంతో.. విడుదలైన నెల రోజులలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు.
సెప్టెంబర్ 22 నుంచి హాట్ స్టార్ లో ఈ చిత్రం ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో అయినా హిట్ అవుతుందేమో చూడాలి.
https://www.instagram.com/p/CdVbTNIIhiv/?utm_source=ig_web_copy_link