టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ప్రపంచ బాక్సింగ్ లెజెంట్ మైక్ టైసన్ కీలక పాత్రలను పోషించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జగన్నాథ్ కలిసి ఈ మూవీని నిర్మించారు. ఇందులో విజయ్ బాక్సర్గా అలరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మరింత హైప్ను క్రియేట్ చేయడం కోసం మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు సంబంధించి ఓ క్రేజీ నెట్టింట వైరల్గా మారింది.
దాని ప్రకారం.. `లైగర్` శాటిలైట్, డిజిటల్ రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు అయ్యాయట. ఒక ప్రముఖ సంస్థ ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ను ఏకంగా రూ. 55 కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. సినిమా పైన విపరీతమైన క్రేజ్ ఉండడం వల్లే ఇంత భారీ రేటు పలికాయని అంటున్నారు.