`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఇందులో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని విలన్గా చేశాడు. శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 12న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలి షో నుండే నెగటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
పరమ రొటీన్ కథను మరింత పరమ రొటీన్గా తెరకెక్కించారని, ఇలాంటి కథను అసలు నితిన్ ఎందుకు ఒకే చేశాడో కూడా అర్థం కావడం లేదని చాలా మంది విమర్శలు గుప్పించారు. అయితే టాక్ ఎలా ఉన్నా తొలి రోజు అదిరిపోయే వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండవ రోజు మాత్రం తేలిపోయింది.
టాక్ బాగోకపోవడం, పోటీగా `కార్తికేయ 2` దిగడం వంటి అంశాలు `మాచర్ల` కలెక్షన్స్ను తీవ్రంగా దెబ్బ కొట్టాయి. అందుకే భారీ డ్రాప్స్ కపించాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 4.62 కోట్ల రేంజ్లో షేర్ను వసూల్ చేసిన ఈ చిత్రం.. రెండవ రోజు రూ. 1.40 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక వరల్డ్ వైడ్గా ఈ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓసారి గమనిస్తే..
నైజాం: 2.00 కోట్లు
సీడెడ్: 0.96 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.85 కోట్లు
తూర్పు: 0.58 కోట్లు
పశ్చిమ: 0.25 కోట్లు
గుంటూరు: 0.65 కోట్లు
కృష్ణ: 0.40 కోట్లు
నెల్లూరు: 0. 33 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ= 6.02 కోట్లు(9.40కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటఖ+రెస్టాఫ్ ఇండియా – 0.35 కోట్లు
ఓవర్సీస్ – 0.32 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 6.69కోట్లు(10.80కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, వరల్డ్ వైడ్గా రూ. 21.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలవాలంటే.. తొలి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.15.31 కోట్ల షేర్ను వసూల్ చేయాలి.