టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇవి కమర్షియల్గా హిట్ అవ్వలేదు.
కానీ, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. అలాగే ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ మాసివ్ అప్డేట్ను మేకర్స్ బయటకు వదిలారు. అదేంటంటే.. ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాలేదు. కానీ అప్పుడే చిత్రబృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసంది. దీంతో నెటిజన్లు రిలీజ్ డేట్ ఓకే గానీ.. షూటింగ్ పరిస్థితేంటి..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఆగస్ట్ లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఇక సెప్టెంబర్ మొదటి వారం నుండి చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
The Reigning Superstar will arrive on 28th April 2023! 🔥🤩
Get ready to witness @urstrulymahesh garu in a scintillating Massy look & high octane entertainer ~ #SSMB28 🌟#Trivikram @hegdepooja @MusicThaman @vamsi84
#SSMB28From28April pic.twitter.com/Mux0pWnfan
— Haarika & Hassine Creations (@haarikahassine) August 18, 2022