టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `సర్కారు వారి పాట` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ నుండి రాబోతున్న చిత్రమిది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ప్రస్తుతం స్క్రిన్ పనులు జరుగుతుండగా.. ఆగస్టు నెల నుండీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. సెకెండ్ హీరోయిన్గా శ్రీలాల నటించే అవకాశాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ మూవీ తమన్ స్వరాలు అందిస్తున్నాయి.
త్రివిక్రమ్ సినిమాకు మహేశ్ అన్ని కోట్లు అందుకుంటున్నాడా..?
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. మహేశ్ ఈ మూవీని త్వరగా ఫినిష్ చేయాలని త్రివిక్రమ్ డెడ్లైన్ పెట్టాడట. ఆ డెడ్లైన్ ప్రకారమే.. తన కాల్ షీట్స్ ఇచ్చాడట. ఇంతకీ ఎన్నో రోజులిచ్చాడో తెలుసా.. వంద రోజులు. అంటే 3 నెలల 10 రోజులన్నమాట.
వంద రోజుల్లో సినిమా షూటింగ్ను పూర్తి చేయాలని మహేశ్ స్ట్రిక్ట్గా చెప్పాడట. మరి అంత తక్కువ సమయంలో త్రివిక్రమ్ షూటింగ్ కంప్లీట్ చేస్తాడా.. లేదా.. అన్నది చూడాలి. కాగా, త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను బాగానే అలరించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.