సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఓవైపు హీరోగా ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తూనే.. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు తన వంతు సాయం చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన వందలాది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు.
తాజాగా మరోసారి మహేష్ బాబు తన గొప్ప మనసును బయట పెట్టాడు. తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే అన్ని సౌకర్యాలను సమకూర్చిన మహేష్ బాబు.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ క్లాసులను ప్రారంభించాడు.
ఇందులో భాగంగానే ఆ ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లను పంపిణీ చేశాడు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో పంచుకుంది.
దీంతో మహేష్ ను మరియు ఆయన గొప్ప మనసును మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్తో తన 28న చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంటనే మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!