టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు `సర్కారు వారి పాట` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది మహేశ్కు 28వ చిత్రం కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని గత కొద్ది రోజుల నుండీ జోరుగా ప్రచారం జరుగుతోంది.
మహేశ్కు విలన్గా ఆ స్టార్ హీరోనా..? నిజమైతే ఫ్యాన్స్కి పండగే!
మహేశ్ బాలనటుడిగా ఉన్నప్పుడు.. తండ్రి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `కొడుకు దిద్దిన కాపురం`లో కెరీర్ లోనే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. హీరోగా ఇప్పటికే డ్యూయల్ రోల్ పోషించింది లేదు. అయితే త్రివిక్రమ్ మూవీలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు రావడంతో.. ఆయన అభిమానులు మహేశ్ డబుల్ యాక్షన్ చూడాలని తెగ ఆశ పడ్డారు.
కానీ, వారి ఆశ నిరాశే అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఓ పుకారే అట. మహేశ్ డబుల్ రోల్స్లో కనిపిస్తాడు అన్నదాంతో ఎంతమాత్రం నిజం లేదట. మహేశ్ బాబు సింగిల్ గానే కనిపిస్తాడనీ .. కాకపోతే మిగతా సినిమాలకి భిన్నంగా కనిపిస్తాడని అంటున్నారు.