వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా దిగబోతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. సంక్రాంతి బరిలో దిగేది మహేశ్ కొత్త సినిమా కాదు.. పాట సినిమా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కాలంలో పాత సినిమాల రీరిలీజ్ హడావుడి బాగా ఎక్కువైంది. అభిమానుల కోరిక మేరకు టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలను 4కె క్వాలిటీతో మళ్లీ విడుదల చేస్తున్నారు.
అయితే రీరిలీజ్లోనూ పాత సినిమాలు అదిరిపోయే వసూళ్లను రాబడతున్నాయి. రీసెంట్గా విడుదలైన `పోకిరి`, `జల్సా` చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన `ఒక్కడు`ను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
2023 జనవరి 15 నాటికి `ఒక్కడు` సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘ఒక్కడు’ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. జనవరి 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తగా ఎంపిక చేసిన సెంటర్స్ లో ప్రదర్శించనున్నారు. సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాల హడావిడి ఉంటుంది. అయినప్పటికీ `ఒక్కడు` చిత్రాన్ని 4కె క్వాలిటీతో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, మహేశ్ బాబు ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా `ఒక్కడు`. గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా భూమిక హీరోయిన్ గా నటించింది. కబడ్డి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుని.. అప్పట్లో భారీ వసూళ్లను రాబట్టింది. మరి రీరిలీజ్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!