Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. మరి కొద్ది నెలల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా మహేశ్ బాబు రాజమౌళికి కొత్త కండీషన్ పెట్టారట. అదేంటంటే.. ఈ చిత్రంతో టాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలని మహేశ్ చెప్పారట. అందుకు కారణంగా ఆయన బాలీవుడ్ హీరోయిన్లతో విసిగిపోవడమే అని ప్రచారం జరుగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాస్తవానికి మహేశ్ బాబు తన సినీ కెరీర్లో అత్యధికంగా బాలీవుడ్ హీరోయిన్లతోనే జతకట్టాడు. ఆయన మొదటి సినిమా హీరోయిన్ ప్రీతి జింటా దగ్గర నుంచీ.. బిపాషా బసు, లీసా రే, కృతి సనన్, సోనాలి బింద్రే, అదితి రావు, అమృత రావు, కియారా అద్వానీ ఇలా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లతో పని చేశారు.
అయితే వాళ్ల కాల్షీట్స్ ఇబ్బంది, వాళ్ల డిమాండ్స్, వాళ్ల ఫెసిలిటీస్ వంటి రకరకాల అంశాలతో మహేశ్ విసిగిపోయాడట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్లను పక్కన పెట్టి, టాలీవుడ్ హీరోయిన్లకే ప్రధాన్యత ఇవ్వాలని రాజమౌళికి మహేశ్ చెప్పినట్లు ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.