రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి.
దాంతో వీరి హ్యాట్రిక్ మూవీపై అభిమానులు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో పట్టాలెక్కబోయే ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఫిబ్రవరిలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కానీ, షూటింగ్ మాత్రం డిలే అవుతూనే వస్తోంది. అయితే ఇటీవల మేకర్స్ ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. దాంతో మహేశ్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న చిత్రీకరణను షురూ చేస్తారని అందరూ భావించినా.. అది జరగలేదు.
అయితే ఆగస్టు రెండో వారం నుండి మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని నిర్ణయించారట. కానీ, అప్పటికి కూడా ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో.. మహేశ్ నెక్స్ట్ మరింత ఆలస్యం అవ్వనుందని తాజాగా టాక్ నడుస్తోంది. ఈ సారి ఆలస్యం మరీ ఎక్కువ కాదట. ఓ వారం రోజులే అట. అంటే ఆగస్టు మూడో వారానికి ఈ మూవీ షూటింగ్ను పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!