`సర్కారు వారి పాట`తో మరో హిట్ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్లో ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని `ఎస్ఎస్ఎంబీ28` అనే వర్కింగ్ టైటిల్తో ఆగస్టు నుండి సెట్స్పైకి తీసుకువెళ్లబోతున్నారు.
ఈ సినిమా పూర్తైన తర్వాత మహేశ్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నాడు. దాదాపు పదేళ్ల క్రితమే వీరి కాంబి చిత్రం రావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల కుదరలేదు. అయితే ఇప్పుడు ఆ శుభ తరుణం వచ్చింది. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇకపోతే రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కానీ, ఒక్కో సినిమాను తెరకెక్కించేందుకు ఆయన చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అయినప్పటికీ రాజమౌళితో సినిమాలు చేసేందుకు వెనకడుగు వేయరు. కానీ, మహేశ్ మాత్రం ఈ విషయంపై కాస్త ఆలోచలనతో పడ్డారట.
ఒక సినిమాకు రెండు, మూడేళ్లు కేటాయించాలంటే మామూలు విషయం కాదు. అందుకే మహేశ్ రాజమౌళిని ఓ రిక్వస్ట్ చేశాడట. సినిమాలో తన పాత్ర కి ఎటువంటి స్పెషల్ లుక్ ఇవ్వద్దని, ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో మూవీ షూటింగ్ పూర్తి చేసేలాగా ఉంటే బాగుంటుందని మహేశ్ బాబు కోరినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఇదే నిజమైతే మహేశ్ రిక్వస్ట్కు రాజమౌళి ఒకే చెబుతాడా..? లేదా..? అన్నది చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!