టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `సర్కారు వారి పాట` హిట్ అనంతరం మహేశ్ బాబు చేస్తున్న చిత్రమిది. ఆయనకు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. త్రివిక్రమ్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారట.
కానీ, అందుకు మహేశ్ మాత్రం నో చెబుతున్నాడట. త్రివిక్రమ్ ఎంత చెప్పినా మహేశ్ అస్సలు ఒప్పుకోవడం లేదట. త్రివిక్రమ్ మూవీ అనంతరం మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని మహేశ్ భావిస్తున్నారు.
అంతకంటే ముందే త్రివిక్రమ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా అంచనాలను అందుకోకపోతే ఎలా అని మహేష్ భావిస్తున్నారట. అందుకే `ఎస్ఎస్ఎమ్బీ 28`ను పాన్ ఇండియా లెవల్లో వద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.