Major: అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాతగా.. శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన “మేజర్” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. 26/11 నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు “మేజర్” చూసి చాలా బావుంది వేగానికి గురవుతున్నారు. సినిమాపై డైరెక్టర్ హరీష్ శంకర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా విజయంతో అడివి శేష్.. ఇంకా డైరెక్టర్ శశికిరణ్ నీ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంటర్వ్యూ లో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ.. అడవి శేష్ కి ఓ ప్రశ్న వేయడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే..” ఈమధ్య ఇండస్ట్రీలో ఎటువంటి ఫంక్షన్ అయినా.. ముఖ్య అతిథిగా వచ్చిన హీరోలను తెగ పొగుడుతూ.. భజన చేస్తూ ఉంటారు. మా దేవుడు అది ఇది అంటూ.. డబ్బా కొడతారు. మరి నువ్వు మహేష్ గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సినిమా హిట్ అయిందని పొగరా..? అంటూ అడవి శేష్ నీ సూటిగా ప్రశ్నించారు. దానికి అడవి శేష్ జవాబు చెబుతూ…” మహేష్ బాబు ఎప్పుడూ కూడా సినిమా నచ్చితేనే ప్రశంసిస్తారు. సినిమాలో ఆయనకు ఏం నచ్చిందో చెప్పి మరీ ప్రత్యేకంగా అభినందిస్తారు. ఇక “మేజర్” విషయానికొస్తే.. సినిమా టీజర్ కి ముందే ఆయనకు సినిమా చూపించాం. సినిమా మొత్తం చూసిన మహేష్ బాబు.. సైలెంట్ గా బయటకు వెళ్ళిపోయారు.
దీంతో మా అందరికీ టెన్షన్ పుట్టింది. సినిమా ఆయనకి నచ్చిందా లేదా అనేది అర్థం కావటం లేదు. అయితే ఈలోపు దూరం నుండి మహేష్ బాబు ని గమనిస్తే ఆయన కంట్లో నుంచి నీరు కారుతోంది. సినిమా అంతగా ఆయనను టచ్ చేసింది. ఆ తర్వాత కంట్రోల్ చేసుకుని నార్మల్ అయి.. దాదాపు రెండు మూడు గంటల పాటు ఆయన మాతో మాట్లాడారు… అంటూ అడవి శేష్ సమాధానమిచ్చారు. ఇక ఇదే సమయంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 26/11 పై కూడా అడవిశేషు వైరల్ కామెంట్లు చేశారు. కేవలం కమర్షియల్ నేపథ్యంలో సినిమా ఉందని, తన స్వార్థం కోసం.. వర్మ సినిమా చేసినట్లుందని నచ్చలేదు అంటూ.. అడవి శేష్..వర్మ 26/11 పై వైరల్ కామెంట్ చేశారు.