Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజర్`. 26/11 ముంబైలోని తాజ్ హోటల్ లో జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో ప్రాణాలు అర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాళ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ జూన్ 3న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను రీచ్ అయిన ఈ చిత్రం.. నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. ఇకపోతే ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలైన యాబై రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు.
కానీ, అనుకున్న దానికంటే చాలా ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. మేజర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకున్న దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. జూలై 3వ తేదీ నుండి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఓ అధికారిక పోస్టర్కు కూడా బయటకు వదిలారు.
The untold story of a son. The untold story of a father. The untold story of a SOLDIER. 🇮🇳🪖
Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam! #MajorOnNetflix pic.twitter.com/1ngxcOciuQ
— Netflix India South (@Netflix_INSouth) June 30, 2022