Malli Nindu Jabili ఏప్రిల్ 28: గుడి మెట్లమీద చనువుగా మాట్లాడుకుంటున్న మల్లి అరవింద్ ను చూసిన వసుంధర మాలిని ఆవేశంతో రగిలి పోతారు. మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 28 నేటి ఎపిసోడ్ 346 లో మల్లి అరవింద్ గురించి నిజం అరవింద్ కుటుంబానికి చెప్పడానికి కారులో బయలుదేరుతారు వసుంధర ఇంకా మాలిని. గత ఎపిసోడ్ లో శరత్ ని కడిగేసిన వసుంధర ఇప్పుడు అరవింద్ ని కడిగేయటానికి వెళ్తుంది…మరి ఈ ఎపిసోడ్ లో ఎమ్ జరుగుతుందో ఇది చదివి తెలుసుకోండి.
అరవింద్ కుటుంబాన్ని నిజం తెలిసిన వసుంధర ఎమ్ చేస్తుంది?
మల్లి ఓపిక త్యాగం చూసి ముగ్ధుడైన అరవింద్ గుడి మెట్ల మీద మల్లికి ధైర్యం చెప్తాడు కాలమే మనల్ని కలుపుతుంది మల్లి అని అంటాడు. ఇది విన్న మాలిని ‘మల్లి మాటలు నా దెగ్గర నా మాటలు మల్లి దెగ్గర చెప్తున్నాడు’ అసలు తప్పు అంత అరవింద్ దెగ్గర ఉంది అని మాలిని వసుంధరతో అంటుంది.
అసలు అరవింద్ ని అడగాలి అని కోపంతో మాలిని వెళ్తుండగా వసుంధర ఆపేస్తుంది. ఆగు మాలిని ‘వాళ్ళ పెళ్లి విషయం నాకు తెలుసు అన్న విషయం ఇంకా అరవింద్ కు తెలియదు అది అలాగే ఉండనివ్వు, ఎందుకంటే వసుంధర గారికి తెలిసికూడా ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు వాళ్లకు ఎదురు వెళ్లే సమయం ఇది కాదు, వాళ్ళ గురించి ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయట పెట్టాలి’ అని వసుంధర అంటుంది.
మల్లి దెగ్గరనుంచి ఆ తాళిని దూరం చేయాలి
తీవ్రంగా ఆలోచిస్తున్న వసుంధరను చూసి ఎమ్ ఆలోచిస్తున్నావు మామ్ అని ఆడుతుంది మాలిని. మల్లి మేడలో ఉన్న ఆ తాళిని చూసుకుని వాళ్లకు ఈ ధైర్యం, ఆ తాళిని ఎలా అయినా వాళ్లకు దూరం చేయాలి అని అంటుంది వసుంధర. వీరిద్దరు బయట విచ్చలవిడిగా తిరుగుతుంటే ఫ్యామిలీ కి అస్సలు ఆలోచన లేదు ఎవరూ లక్ష్మణ రేఖను గీయటం లేదు, బలాదూర్లు తిర్గమని బరితెగించమని వొదిలేసారు. ఆలస్యం అమృతం విషం అన్నట్లు మనం లేట్ చేస్తున్న కొద్ది వాళ్ళు మరింత రెచ్చిపోతారు అందుకే వాళ్ళిద్దరి విషయం వాళ్ళ ఇంట్లోనే తేలుస్తాను అని అంటుంది వసుంధర. పెళ్లి విషయం చెప్పేసి అందర్నీ కాలర్ పట్టుకున్నట్టు నిలదీస్తాను అంటుంది.
ఇప్పుడు ఈ ఇంట్లో మనం పెద్ద బాంబు పేల్చబోతున్నాం
తరువాత సీన్ లో మాలిని వసుంధరలు అరవింద్ ఇంటికి చేరుకుంటారు. ఇంటి బయట నిలబడి ‘ఇప్పుడు ఈ ఇంట్లో మనం పెద్ద బాంబు పేల్చబోతున్నాం అందరికి నిజాలు తెలిసిన తరువాత ఆ మల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అందరూ నీ కాళ్ళు పట్టుకుని జరిగిన తప్పుకు క్షమించమని అడుగుతారు’ అని అంటుంది వసుంధర.
అందరూ ఒకసారి బయటకి వస్తారా…అని ఇంట్లో హాల్ లో నిలుచుని కేక వేస్తుంది వసుంధర. అనుపమ ఇంకా మిగిలిన వారు బయటకు వొచ్చి మాలినిని చూసి ఆనందిస్తారు. అమ్మ మాలిని ఎలా ఉన్నావ్ ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటూ అడుగుతుంది అనుపమ. పక్కన ఉన్న రామకృష్ణ సుందర్ ని పిలిచి కాఫీ తీసుకు రమ్మంటాడు.
అయిపోయాయా మీ ఆప్యాత పలకరింపులు అని వెంగ్యంగా అంటుంది వసుంధర…మీ పలకరింపులకి పులకరించిపోవాలని రాలేదు ఇక్కడికి, గాంధారిలా కళ్ళకు గంతలు కట్టుకున్న మీకు ఒక నిజం చెప్పాలని వొచ్చాము అని అంటుంది వసుంధర. ఆ నిజం విన్న తరువాత నమ్మడానికి మీకు కొంచెం సమయం పడుతుంది అని జోడిస్తుంది మాలిని. అది నిజామా కాదా అని అనుమానం కూడా వొస్తుంది కానీ మీరు నమ్మిన నామకపోయిన నిజం అబద్ధం అయిపోదు అని అంటుంది మాలిని.
అరవింద్ మల్లికి సంబంధించిన చాలా పెద్ద నిజం
ఏంటి ఆ నిజం అని కుటుంబ సభ్యులు అడగగా … అరవింద్ మల్లికి సంబందించిన చాలా పెద్ద నిజం అని అంటుంది వసుంధర. మనం ఎంత చెబుతున్న వినకుండా ఎందుకు అరవింద్ మల్లి కలిసి తిరుగుతున్నారో ఎందుకు విడదీయరాని సంబంధం లా కలిసి పోయారో తెలుసా? వాళ్లిద్దరూ భార్య భర్తలు కాబట్టి అని బాంబు పేలుస్తుంది వసుంధర. అరవింద్ మల్లి మేడలో తాళి కట్టాడు కాబట్టి మల్లిని వొదులుకోలేక పోతున్నాడు ఆ బంధాన్ని తెంచుకోలేక పోతున్నాడు. ఇది అబద్ధం అని అంటుంది అనుపమ కాదు నిజం అని అంటుంది మాలిని. వారిద్దరి మధ్య బాండింగ్ ఉన్నదీ అంటే అర్ధం చేసుకోగలం కానీ వాళ్ళకి పెళ్లయింది అంటే మాత్రం నమ్మలేము అని అంటారు. ఇంతలో అక్కడికి అరవింద్ మల్లి గుడి నుంచి వొస్తారు. ఆ తరువాత వసుంధర మల్లి మేడలో తాళి బయటకు లాగి అందరికి చూపిస్తుంది… మల్లిని అందరూ నిలదీస్తుంటే అరవింద్ అందరిని ఆపేసి నిజం చెప్పేస్తాడు. ఆ తరువాత ఏమైందా అని కుతూహలంగా ఉందా? అయితే డిస్నీ+ హాట్ స్టార్ లో మల్లి నిండు జాబిలి ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.