మంచు విష్ణు నటించిన `జిన్నా` చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు మంచు స్వయంగా ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మాత్రం చాలా అంటే చాలా యావరేజ్గా ఉన్నాయి. అసలు జిన్నా వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజులను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా కేవలం రూ. 45 లక్షల షేర్, రూ. 85 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిదింది.
ఈ చిత్రానికి రూ. 4.35 కోట్ల రేంజ్ లో థియేటర్ బిజినెస్ జరిగింది. రూ 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం..ఈ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా చాలా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ, వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇక జిన్నా కలెక్షన్స్ చూసి నెటిజన్లు ట్రోల్స్ పేలుస్తున్నారు.
ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సన్నీ లియోన్ కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటే.. కనీసం ఆమె రెమ్యునరేషన్ లో సగం కూడా ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జిన్నా రూపంలో మంచు విష్ణు ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడింది.