పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం అందరికి తెలుసు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇటీవలె సైలెంట్గా ప్రారంభం అయిందని వార్తలు వచ్చాయి.
`రాజా డీలక్స్` అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైనా ప్రభాస్ ఫ్యాన్స్కి పాపం మారుతి భయపడుతూనే ఉన్నాడు. వాస్తవానికి మారుతితో ప్రభాస్ సినిమా చేయడం డార్లింగ్ ఫ్యాన్స్ ఏ మాత్రం ఇష్టం లేదు.
ముందు నుంచి వీరి ప్రాజెక్ట్ పై వ్యతిరేకత ఉంది. ఈ విషయం మారుతికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే `లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మారుతి.. ప్రభాస్ ఫ్యాన్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలేమైందంటే.. తాజాగా జరిగిన `లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి.. హీరో సంతోష్ శోభన్ గురించి బాగా మాట్లాడారు.
అయితే మారుతి తన స్పీచ్ ను ముగిస్తున్న సమయంలో.. సంతోష్ శోభన్ వచ్చి ప్రభాస్ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా..? అంటూ అడిగాడు. అందుకు మారుతి `ఫ్యాన్స్ నన్ను కొడతారేమో` అని ప్రభాస్ అభిమానులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తైనా మారుతిలో భయం పోలేదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!