Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల `ఆచార్య`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడులైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు చిరు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాల విడుదలకు రెండు పెద్ద పండగలపై కన్నేశారట.
ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కి అఫీషియల్ రీమేక్ ఇది. ఇందులో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి దర్శకుడుతో బాబీతో తన 154 చిత్రం చేస్తున్నాడు. `మెగా 154` వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ దాదాపు కన్ఫామ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు. వాస్తవానికి టాలీవుడ్ లో సంక్రాంతి, దసరా సీజన్స్లో విడుదలయ్యే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడా రెండు పండగలను చిరు వదిలేదే లే అంటుండటంతో బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారనుంది.