`సీతారామం` సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్లో దాదాపు అర డజన్కు పైగా చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. `సీతారామం`తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ మూవీతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మృణాల్కు.. ఇప్పుడు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది.
ముఖ్యంగా పెళ్లి, పిల్లలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. మృణాల్ మాట్లాడుతూ.. `నా మనసుకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. నా మనసును అర్థం చేసుకోవాలి. నన్ను, నా వృత్తిని గౌరవించాలి. నాకు ఎల్లప్పుడూ రక్షణకు ఉండాలి. అలాంటి వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా` అంటూ చెప్పుకొచ్చింది.
అక్కడితో ఆగలేదు.. ఇంకా మాట్లాడుతూ.. `పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ అని పిలిపించుకోవాలనే ఆశ ఉంది. ఒకవేళ పెళ్లి కాకపోయినా పిల్లలను మాత్రం ఖచ్చితంగా కంటాను. అది టెస్ట్ట్యూబ్ బేబీ ద్వారా. అందుకు మా అమ్మ కూడా అంగీకరించింది` అంటూ మృణాల్ పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మృణాల్ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!