Nabha Natesh: నభా నటేష్.. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసి కన్నడ మూవీతో సినీ రంగప్రవేశం చేసిందీ బ్యూటీ. ఆ తర్వాత `నన్ను దోచుకుందువటే` మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జోడీగా `ఇస్మార్ట్ శంకర్` మూవీలో మాస్ హీరోయిన్గా నటించి ఇస్మార్ట్ పోరిగా గుర్తింపు పొందింది.
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2019లో విడుదలై అంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ తర్వాత `అల్లుడు అదుర్స్`, `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `మాస్ట్రో` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ నాలుగు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. దాంతో దర్శకనిర్మాతలు నభా వైపు చూడటం మానేశారు.
ప్రస్తుం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే ఆఫర్స్ లేకపోయినా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తుందట. రూ. కోటి ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానని చెబుతోందట. దాంతో మీడియం బడ్జెట్ లో తెరకెక్కే చిత్రాల్లోనూ ఆమెను తీసుకోవడం మానేశారట. ఆమె రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మాత్రం అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు.