యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా ఇప్పటికే `బంగార్రాజు` చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో మళ్లీ వీరి కాంబో సెట్ అయింది. నాగచైతన్య తన 22వ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కబోయే ఈ చిత్రానికి ఇళయరాజా మరియు ఆయన తనయుడు యువన్ శంకర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా రేపటి నుంచి పట్టాలెక్కబోతోంది.
అవును రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో చైతు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇటు నాగచైతన్య, అటు కృతి శెట్టి.. ఇద్దరికీ చాలా కీలకంగా మారింది.
అందుకు కారణం లేకపోలేదు. నాగచైతన్య చివరి చిత్రం `థాంక్యూ` ఎన్నో అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. మరోవైపు కృతి శెట్టి గత మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశ పడుతున్నారట.
With all ur love and blessings beginning my next #VP11 tomorrow with @chay_akkineni #NC22 @SS_Screens YES the shoot begins tomorrow @ilaiyaraaja @thisisysr pic.twitter.com/0ugXmSgDRD
— venkat prabhu (@vp_offl) September 20, 2022