యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గతం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2017లో గోవా వేదికగా పెద్దల సమక్షంలో అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ, ఎక్కువ కాలం వీరి బంధం నిలవలేదు. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే సామ్తో విడిపోయిన చైతు.. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ను కెరీర్ పైనే పెట్టి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
ఇకపోతే తాజాగా ఈయన నుండి `థ్యాంక్యూ` చిత్రం వచ్చింది. విక్రమ్ కె. కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.
అయితే ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా చైతు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరమైన విషయాలే కాకుండా విడాకులు తర్వాత లైఫ్ ఎలా మారింది అన్న దానిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. చైతు మాట్లాడుతూ.. `విడాకుల తర్వాత ఒక వ్యక్తిగా తన జీవితం ఎంతో మారింది.
గతంలో తాను ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. కానీ, ఇప్పుడు తన కుటుంబం, స్నేహితులతో ఎక్కువగా గడుపుతున్నాను. తనలో తాను కొత్త వ్యక్తిని చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!