యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం `థ్యాంక్యూ`. విక్రమ్ కె కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. `లవ్స్టోరీ`, `బంగార్రాజు` వంటి సూపర్ హిట్స్ తర్వాత చైతు నుండి వస్తోన్న చిత్రమిది. ఇందులో రాశీఖన్నా మెయిన్, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రాగా.. మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
చైతు `థ్యాంక్యూ`ను ఎందుకు చూడాలి..? దిల్ రాజు అదిరిపోయే ఆన్సర్!
ఇందులో భాగంగానే చైతు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని రివిల్ చేశాడు.చైతు మాట్లాడుతూ.. `సాధారణంగా విక్రమ్ కుమార్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతమాత్రం ఊహించని ఒక ట్విస్ట్ ఉంటూ ఉంటుంది.
అక్కడి నుంచే కథ రసవత్తరమైన మలుపు తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక ట్విస్ట్ థ్యాంక్యూ సినిమాలోనూ ఉంటుంది .. అదే ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుంది, ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది` అంటూ చెప్పుకొచ్చారు. ఈయన వ్యాఖ్యలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.