`లవ్ స్టోరీ`, `బంగర్రాజు` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. `థ్యాంక్యూ` తో హ్యాట్రిక్ కొట్టాలని చూశారు. కానీ అది జరగలేదు. ప్రస్తుతం నాగచైతన్య వెంకట ప్రభు దర్శకత్వంలో తన 22వ సినిమాని చేస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తికాక ముందే నాగచైతన్య ఓ ఫ్లాప్ డైరెక్టర్తో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల విడుదలైన `విరాటపర్వం`తో బిగ్ ఫ్లాప్ను మూటగట్టుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తాజాగా నాగచైతన్యను కలిసి ఒక కథను వినిపించారట. ఆ కథ చైతూకు బాగా నచ్చడంతో.. వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
ఇదో పొలిటికల్ డ్రామా అని.. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు బయటకు రానున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా నాగచైతన్య మరోవైపు `దూత` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.
https://newsorbit.com/cinema/clarity-on-naga-chaitanya-second-marriage.html