టాలీవుడ్ లవబుల్ కపుల్ సమంత, నాగచైతన్యలు విడిపోయి చాలా నెలలు గడిచాయి. అయినప్పటికీ.. వీరిద్దరి బ్రేకప్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సామ్, చైతూలు ఎక్కడ కనిపించినా.. విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా నాగ చైతన్యకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో కలిసి నాగచైతన్య `లాల్ సింగ్ చడ్డా` అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చైతు బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
దీంతో చిత్ర టీమ్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రేక్షకుల్లో `లాల్ సింగ్ చడ్డా`పై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చైతు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ సామ్తో విడిపోవడంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఆయన `విడాకులపై ఇప్పటికే సమంత, నేను ప్రకటన చేశాం.
ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. ఏం చెప్పాలనుకున్నామో అది ఆల్రెడీ చెప్పేశాం. ఇంతకంటే ఇంకేం చెప్పాలి. మా విడాకుల గల కారణాలేమిటనేది ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. దానిని పర్శనల్ అని ఎందుకు అంటారో అందరికీ తెలుసు` అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.