Naga Chaitanya: `లవ్ స్టోరీ`, `బంగార్రాజు` వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య నుంచి రాబోతున్న చిత్రం `థ్యాంక్యూ`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించగా.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.
ఇందులో రాశి ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ మంచి అంచనాలను క్రియేట్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్లో చూద్దామా అని ఉత్సాహ పడుతున్న ఫ్యాన్స్కు తాజాగా చైతు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. `థ్యాంక్యూ` రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.ఏకంగా రెండు వారాలు ఆలస్యంగా రాబోతోంది. జూలై 8న కాకుండా జూలై 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
మరోవైపు చైతు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దీంతో అసలెందుకు రిలీజ్ డేట్ విషయంలో చైతు వెనక్కి తగ్గాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాలో నాగచైతన్య త్రీ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
#ThankYouTheMovie is now hitting the screens on July 22nd!
It will be worth the wait…We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ
— Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022