టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి లకు మధ్య బంధుత్వం ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే నాగశౌర్య కు లక్ష్మీప్రణతి చెల్లెలు అవుతుందట. కానీ వీరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. అదెలా.. బంధుత్వం లేకుండా వీరిద్దరూ అన్నా-చెల్లెలు ఎలా అవుతారు అనేగా మీ సందేహం..?
అయితే ఎట్టకేలకు నాగశౌర్య ఆ గుట్టును విప్పేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగశౌర్య రీసెంట్ గా `కృష్ణ వ్రింద విహారి` అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.
వరుస ఫ్లాపుల అనంతరం ఈ మూవీతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాగ శౌర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సతీమణి ప్రణతితో బంధుత్వంపై ప్రశ్న ఎదురైంది. అందుకు నాగశౌర్య బదులిస్తూ.. `నాకు చాలా కాలంగా పూజిత్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు.
వాళ్ల సిస్టర్ ను తారక్ పెళ్లి చేసుకున్నాడు. ప్రణతిని చెల్లి, చెల్లి అంటూ ఉండే వాడిని. చిన్నప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు. అందువల్లే చాలా మంది ప్రణితికి నేను కజిన్ అనుకుంటారు. కానీ, అది నిజం లేదు. పూజిత్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగానే ప్రణతి తెలుసు` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగశౌర్య కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
https://newsorbit.com/entertainment-news/nagashaurya-gave-clarity-on-who-to-marry.html
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!